Friday, April 2, 2010

రిపోర్టర్స్ డైరీ


మంచిపని. ఎండాకాలంలో ఎందేగొంతులు తడపాలనే ఆలోచనతో చల్లని నీరు ఉచితంగా అందివ్వడం చాలా మంచిపని. చలివేంద్రాలు రోడ్ పక్కగా ఏర్పాటు చేస్తారు. మండే ఎండల్లో ఏర్పాటు చేసిన ఆ గుడారాలలో నీళ్ళు పోసేందుకు మనుషులను పెడతారు. అలా పెట్టిన వారిలో ఒక వృద్దురాలు కూడా ఉండడం అన్యాయం అనిపించింది. ఒక రాజకీయనాయకుడు ఏర్పాటు చేసిన చలివెంద్రంలో ఆ పార్టీ కార్యకర్త తన తల్లిని ఉంచాడు. పైసా ఖర్చు చేయకుండా ముసలమ్మను మండుటెండలో నిలబెట్టి వందలమందికి నీళ్ళు పోయమనడం ఎంత అన్యాయం? అదే రాసాను. దానికి రిసల్ట్ కనిపించింది. ఆ మామ్మ కు విముక్తి లభించింది. నిజంగా నేను చేసింది కూడా మంచిపనే. కాదంటారా?

-ఎస్.సత్యబాబు

No comments: